ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు త్వరలో శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వైన్ షాపుల వద్ద పర్మిట్ రూములు (Permit Rooms) ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని గమనించి, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మరింత నియంత్రితంగా మద్యం వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అధ్యయన కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం
పర్మిట్ రూములు ఏర్పాటు చేయడం ద్వారా అసురక్షితమైన ప్రదేశాల్లో మద్యం సేవించే సంస్కృతిని తగ్గించవచ్చని భావిస్తున్నారు. అందుకోసం సీఎం (CBN) ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి, అక్కడి మోడళ్లను పరిశీలించి నివేదిక సమర్పించనుంది. నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ విధానం రూపుదిద్దుకోనుంది.
ఆన్లైన్ లిక్కర్ కొనుగోళ్లకు ప్రోత్సాహం
ప్రమాదాలను నివారించడంలో భాగంగా ప్రభుత్వం మద్యం ఆన్లైన్లో ఆర్డర్ చేసే వ్యవస్థను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా అక్రమ రవాణా, నకిలీ మద్యం సమస్యలను ఎదుర్కొనడంలో ఇది ఉపయుక్తంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం పొందిన వ్యాస్థాపనలతో మద్యం వినియోగాన్ని నియంత్రించేందుకు, మరింత భద్రతతో కూడిన సేవలు అందించేందుకు ఈ కొత్త చర్యలు చేపట్టబోతున్నారు.
Read Also : Elon Musk : ఈరోజు ఎలాన్ మస్క్ ఇండియాకు వస్తారా?