हिन्दी | Epaper

Telugu News: Gold Mines: కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

Pooja
Telugu News: Gold Mines: కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

దేశవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో సామాన్యులకు కొంత ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో బంగారు గనుల (Gold Mines) తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దేశీయంగా బంగారం ఉత్పత్తి పెరిగితే భవిష్యత్తులో ధరలపై నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also:  AP: స్మార్ట్ రేషన్ కార్డుల ఉచిత పంపిణీకి రేపే లాస్ట్ డేట్

Gold Mines
Gold mining operations have begun in Kurnool.

జొన్నగిరిలో జియో మైసూర్ సంస్థ తవ్వకాలు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో ‘జియో మైసూర్’ సంస్థ బంగారు తవ్వకాలను చేపట్టింది. జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల చుట్టుపక్కల బంగారు(Gold Mines) నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) గతంలోనే గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుమారు 1,477 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసింది.

ఒక్క టన్ను మట్టిలో 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం

అధికారుల అంచనాల ప్రకారం ఒక టన్ను ఖనిజ మట్టిని శుద్ధి చేస్తే 1.5 నుంచి 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశముంది. దీనికి సుమారు రూ.5 వేల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. అలాగే వెయ్యి టన్నుల ముడి ఖనిజం నుంచి దాదాపు 700 గ్రాముల బంగారం వెలికితీయవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

పదేళ్లలో వేల టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యం

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రాబోయే పదేళ్లలో సుమారు 6 వేల టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని జియో మైసూర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతంలో మొత్తం మీద కోటి టన్నుల వరకు ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా తూర్పు బ్లాక్‌లో భూమికి సుమారు 180 మీటర్ల లోతులో 6.8 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అధునాతన యంత్రాలతో రోజుకు వెయ్యి టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

📢 For Advertisement Booking: 98481 12870