దేశవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో సామాన్యులకు కొంత ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో బంగారు గనుల (Gold Mines) తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దేశీయంగా బంగారం ఉత్పత్తి పెరిగితే భవిష్యత్తులో ధరలపై నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: AP: స్మార్ట్ రేషన్ కార్డుల ఉచిత పంపిణీకి రేపే లాస్ట్ డేట్

జొన్నగిరిలో జియో మైసూర్ సంస్థ తవ్వకాలు
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో ‘జియో మైసూర్’ సంస్థ బంగారు తవ్వకాలను చేపట్టింది. జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల చుట్టుపక్కల బంగారు(Gold Mines) నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) గతంలోనే గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుమారు 1,477 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసింది.
ఒక్క టన్ను మట్టిలో 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం
అధికారుల అంచనాల ప్రకారం ఒక టన్ను ఖనిజ మట్టిని శుద్ధి చేస్తే 1.5 నుంచి 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశముంది. దీనికి సుమారు రూ.5 వేల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. అలాగే వెయ్యి టన్నుల ముడి ఖనిజం నుంచి దాదాపు 700 గ్రాముల బంగారం వెలికితీయవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
పదేళ్లలో వేల టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యం
ఈ ప్రాజెక్ట్లో భాగంగా రాబోయే పదేళ్లలో సుమారు 6 వేల టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని జియో మైసూర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతంలో మొత్తం మీద కోటి టన్నుల వరకు ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా తూర్పు బ్లాక్లో భూమికి సుమారు 180 మీటర్ల లోతులో 6.8 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అధునాతన యంత్రాలతో రోజుకు వెయ్యి టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: