గంగమ్మ నవరాత్రి ఉత్సవాలు
తిరుపతి : రాయలసీమ జిల్లా (Rayalaseema District) ల్లోనే ఎంతో ప్రాశస్త్యం కలిగిన, తిరుపతి నగరగ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఈనెల 22వతేదీ నుండి నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ తొమ్మిదిరోజులు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో గంగమ్మ భక్తులకు దర్శనమిస్తారు. దేవీశరన్నవ రాత్రి ఉత్సవాల (Gangamma Navratri celebrations) ను పురస్కరించుకుని గంగమ్మ ఆలయంలో ఉభయదారులు భక్తులకు సేవలందిస్తారు. 22వతేదీ సోమవారం ఉదయం 23వతేదీ శుక్లపాడ్యమిరోజు మహాగణపతిపూజ, కలశ స్థాపనతో ఆరంభమవుతాయి. మంగళవారం బాలత్రిపురసుందరీదేవి ఆలంకారంలో,
రాజేశ్వరిదేవి అలంకారంలో గంగమ్మ భక్తులకు
24వతేదీ గాయత్రిదేవి అలంకారం, 25న అన్నపూర్ణాదేవి ఆలంకారం (Annapurna Devi’s decoration), 26న మహాలక్ష్మీదేవిగా, 27న లలితాత్రి పుర సుందరిదేవిగా, 28న వారాహిదేవిగా, 29న సరస్వతిదేవి అలంకారంలో, సెప్టెంబర్ 30న దుర్గాదేవిగా, అక్టోబర్ 1వతేదీ మహిషాసుం “మర్థినీదేవి అలంకారంలో, 2వతేదీ రాజేశ్వరిదేవి అలంకారంలో గంగమ్మ (Gangamma), భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయంలో ఆ తొమ్మిది రోజులు ప్రతిరోజూ ఉదయం 7గంటలకు అభిషేకం, 8గంటలకు హోమం, 9గంటలకు సహస్రనామార్చన, సాయంత్రం ఊంజల్సేవ ఉంటుంది. భక్తులు దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని ఆలయ ఛైర్మన్ మహేశ్ యాదవ్, ఆలయ ఇఒ జయకుమార్ కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: