విజయవాడ : ప్రకాశం బ్యారేజి వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక(Danger warning) జారీ చేశారు. ఇక్కడ ఇన్ప్లే, ఔట్లో 6.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో 69 గేట్లు ఎత్తినీటిని విడుదల చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలను జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణానదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కృష్ణానదికి వరదల దృష్ట్యా మండలాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
Read Also: Stampede: ముందుచూపు లేని అధికారులు

కొల్లూరు మండల కంట్రోల్ రూం నంబర్ 7794894544, భట్టిప్రోలు మండలం కంట్రోల్ రూం నెంబరు(Control room number) 8179886399గా గమనించి పరిస్థితులు వివరించి రక్షణ పొందవచ్చునని అధికారులు వివరించారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ సెల్ఫీ దిగడం. ఘాట్ దాటి రావడం సరికాదని, ప్రాణాంతకమని అధికారులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా నదిలో బోట్లు విహరాన్ని నిషేదించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: