हिन्दी | Epaper

Fake Stamps: నకిలీ ఈ స్టాంపులు కుంభకోణం కేసు కళ్యాణదుర్గానికి బదలీ

Ramya
Fake Stamps: నకిలీ ఈ స్టాంపులు కుంభకోణం కేసు కళ్యాణదుర్గానికి బదలీ

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

కళ్యాణదుర్గం(Anantapur District): కళ్యాణదుర్గం (Kalyanadurg) లో వెలుగుచూసిన నకిలీ ఈ స్టాంపుల (Fake Stamps) వ్యవహారంపై తీగ లాగితే డొంక కదులుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్టాంపులు కుంభకోణం రాజకీయ దుమారం లేపటంతో పాటు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును నమోదు చేసుకున్న అనంతపురం 2 టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు (Amilineni Surendrababu) కుటుంబానికి చెందిన ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీసేవ నిర్వాహకుడు ఎర్రప్ప అలియాస్ బాబు (Errappa alias Babu) తోపాటు అతని భార్య భార్గవి (Bhargavi), మోహన్ (Mohan) అనంతపురం 2వ పట్టణ పోలీస్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని తొలుత అనంతపురం (Anantapur) డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. గురువారం కేసును కళ్యాణదుర్గం (Kalyanadurg) పట్టణ పోలీస్ స్టేషన్ బదిలీ చేసి నిందితులను అక్కడికి తరలించారు. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం పోలీసులు ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేశారు. ఎర్రప్ప 2020 నుంచి ఇప్పటివరకు 13 వేలకు పైగా ఈ స్టాంప్లు జారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రప్ప, అతని భార్య భార్గవి, మోహన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బ్యాంకు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. గతంలో మీసేవలో పనిచేసిన వ్యక్తుల వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కంబదూరు (Kambadur) మండలానికి చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఎర్రప్ప చేస్తున్న నకిలీ ఈస్టాంపుల వ్యవహారాన్ని తొలుత స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. ఎర్రప్ప జారీ చేసిన ఈస్టాంపులు, ప్రభుత్వానికి జమైన నగదును పోల్చి చూడగా తేడాలు ఉన్నట్లు తేలడంతో విచారణ చేపట్టారు. నకిలీ ఈ స్టాంప్ (Fake Stamps) కుంభకోణం పై రాష్ట్ర రెవిన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల మంత్రి అనగానీ సత్య ప్రసాద్ స్పందించారు. పోలీసుల అదుపులో ఉన్న ఈ స్టాంపుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున ఎర్రెప్ప అలియాస్ మీసేవబాబును శని, ఆదివారాలలో పోలీసులు అధికారికంగా అరెస్టు చూపించి కేసువివరాలను వెల్లడించే అవకాశం ఉంది. స్టాంప్ ల టాంపరింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు హెచ్చరించారు. కళ్యాణదుర్గం నకిలీ ఈ స్టాంపుల అవినీతిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది

Read also: Farmer: దిక్కుతోచని తోతాపురి రైతు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

📢 For Advertisement Booking: 98481 12870