हिन्दी | Epaper

CM Chandrababu: అనంతపురం లోముఖ్యమంత్రి పర్యటన

Anusha
CM Chandrababu: అనంతపురం లోముఖ్యమంత్రి పర్యటన

సత్యసాయి జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో మెగా పేరెంట్ టీచర్ మీట్ (పిటిఎం) కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఇలా కొనసాగునుంది. అధికార వర్గాలు తెలియజేసిన మేరకు ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఉదయం 8 గంటలకు ఉండవల్లి నుండి విజయవాడ ఎయిర్పోర్ట్ బయలుదేరి 8:10 కి చేరుకుంటారు. 8.15 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారు. 9:10 గంటలకు ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి 9:25 గంటలకు కొత్తచెరువులోని శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు.

 CM Chandrababu: అనంతపురం లోముఖ్యమంత్రి పర్యటన
CM Chandrababu: అనంతపురం లోముఖ్యమంత్రి పర్యటన

మెగా పేరెంట్ టీచర్ మీట్

9:30 గంటల నుండి 9:50 గంటల వరకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఇష్టాగోష్టి నిర్వహిస్తారు. 9:55 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మెగా పేరెంట్ టీచర్ మీట్ సభలో పాల్గొంటారు. ఒంటిగంటకు కొత్తచెరువు (Kothacheruvu) లోని బాలుర జడ్పీహెచ్ఎస్ స్కూల్ను సందర్శించి అక్కడినుండి పుట్టపర్తి ప్రశాంత నిలయంకు 1:15 గంటలకు చేరుకుంటారు. 02:15 గంటల వరకు ప్రశాంతి నిలయంలో గడిపిన అనంతరం అక్కడి నుండి బయలుదేరి 02:25 గంటలకు శ్రీ సత్య సాయి విమానాశ్రయంకు చేరుకోనున్నారు. 02:35 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 3:30 గంటలకు విజయవాడ విమానాశ్రయం (Vijayawada Airport) కు బయలుదేరి వెళ్లనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.

నారా చంద్రబాబు నాయుడు జన్మస్థలం ఏది?

నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, నారావారి పల్లె అనే గ్రామంలో 1950 ఏప్రిల్ 20న జన్మించారు.

చంద్రబాబు నాయుడు స్థాపించిన ప్రముఖ సంస్థ ఏది?

నారా చంద్రబాబు నాయుడు స్థాపించిన ప్రముఖ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. ఇది డైరీ, రిటైల్, అగ్రి రంగాల్లో సేవలు అందిస్తున్న కంపెనీ.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Vijayawada: సచివాలయ ప్రవేశ విధానంలో మార్పులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

📢 For Advertisement Booking: 98481 12870