నిరుద్యోగ యువతకు శిక్షణ కోసం ప్రభుత్వం 200 స్కిల్ హబ్ల ఏర్పాటు
విజయవాడ : ఆంధ్రప్రదేశను(Andhra Pradesh) దేశంలోనే అన్ని(CM Chandrababu) రంగాల్లో రంగాలను B ఉత్తమంగా నిలపాలన్నదే తమ ప్రభుత్వ కీలక లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు. వ్యవసాయం, పారిశ్రామిక, విద్యా, వైద్య, రంగా దిశలో ముందుకు నడిపిస్తున్నామన్నారు. ఉండవల్లి కార్యాలయంలో నేడు అందుబాటులో ఉన్న మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్ధికంగా. సామాజిక వరిపుష్టం కావాలని ప్రభుత్వం కోరుతుందన్నారు. మంచి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు దిశలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది., ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నది తమ ప్రభుత్వం అన్నారు. ఉపాధి, నైపుణ్యం విద్య, నైపుణ్యాల పెంపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహానికి కేంద్ర బిందువులు. నైపుణ్యాల ఆఫ్ లైన్, ఆన్ లైన్ అప్ గ్రేడేషన్ పై దృష్టిసారిస్తూ స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రజల నైపుణ్యాలను గుర్తించడానికి రాష్ట్రం మొట్టమొదటిసారిగా నైపుణ్య గణనను నిర్వహిస్తోంది అభివృద్ధికి ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే అంశంపై దృష్టిసారిస్తూ ఉపాధికల్పనకు బలమైన పునాది వేయడమే మా ప్రభుత్వ సమగ్ర విధానం. ఆత్మగౌరవం, ఆర్థిక స్థిరత్వం రెండింటినీ తీసుకొచ్చే వృత్తులకు విలువనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ స్వీయ సంతృప్తికరమైన పనిని స్వీకరించడం జరిగింది. వారి వ్యవస్థాపక స్ఫూర్తి వారిని అవకాశాలను చురుకుగా ఉపయోగించుకోవడానికి ప్రేరేపిస్తుంది, నైపుణ్యాలను స్థిరమైన జీవనోపాధిగా మారుస్తుంది.
Read also: ధాన్యం కొనుగోళ్లు సంతృప్తికరం.. 32 శాతం పెరిగిన సేకరణ

నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ సృష్టి పై కేంద్ర దృష్టి
నైపుణ్యాలను పెంపొందించడానికి, నైపుణ్య బదిలీ నమూనాను అనుసరిస్తున్నాం. దీని క్రింద స్థానిక పరిశ్రమ అవసరాలను తీర్చడానికి(CM Chandrababu) నిరుద్యోగ యువత, కళాశాల డ్రాపవుట్ లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ లు, కళాశాలల్లో 200 స్కిల్ హబ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు. ఈ కార్యక్రమం క్రింద, 4,700 ఎకరాల్లో 800పైగా భూ కేటాయింపులను విజయవంతంగా నిర్వహించి, రూ.78,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 48,789 ఉద్యోగాలను కల్పించడమయింది గణనీయమైన జనాభా పరివర్తనలకు లోనవుతోంది, వీటిలో సంతాన సాఫల్యత రేటు (టిఎఫ్తార్) లో తీవ్రమైన క్షీణత మరియు వృద్ధావ్య జనాభా వేగంగా పెరగడం, సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థల క్షీణత చేరి ఉన్నాయి, ప్రతి ఒక్కటి దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉన్నాయి. డెమోగ్రాఫిక్ మేనేజ్ మెంట్ పై ఒక విధానాన్ని ప్రారంభించడం ద్వారా తగ్గుతున్న శ్రామిక శక్తి, వృద్ధాప్య జనాభా మరియు మారుతున్న కుటుంబ ధోరణుల పర్యవసాన ప్రభావాలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లలు మించకూడదు అనే నిబంధనను మేము ఇప్పటికే రద్దు చేశాం. అంతేకాకుండా, మా హామీలకు అనుగుణంగా పిల్లల చదువులు కుటుంబానికి భారంగా మారకుండా తల్లులకు ఆర్థిక చేయూతనిస్తూ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నాం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: