మాజీ ఎంపి చింతా మోహన్..
కడప : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 11 సంవత్స రాలలో రూ.14.50 లక్షల కోట్ల లు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పిఏ) బ్యాంకుల ద్వారా రుణమాఫీ చేసిందని, అందులో పది శాతం కమిషన్ తీసుకుని లక్ష కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ (Chinta Mohan) ఆరోపించారు. సోమవారం కడప వైయస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో, ఎవరెవరికి ఎంత రుణమాఫీ చేశారో వివరాలతో కూడిన జాబితాను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు
లక్ష కోట్ల రూపాయల అవినీతిపై సిబిఐ, ఈడి ద్వారా విచారణ జరిపించాలన్నారు. అమరావతిలో నీటిపై చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాజధాని నిర్మిస్తున్నారని, ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. అమరావతిలో ఎక్కడ తనకు దేవతలు కనిపించడం లేదని, కర్ర తుమ్మ చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) అవసరం లేదన్నారు. రాజధాని విషయంలో రాష్ట్రంలోని 20 జిల్లాల ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. విషయంలో రాజధాని విషయంలో పునరాలోచించుకోవాలన్నారు. రాయలసీమలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తే 25 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాక గోదావరి నీళ్లు, బనకచర్ల గురించి ఆలోచిస్తే బాగుంటుందన్నారు.
చింతా మోహన్ ఏ పార్టీకి చెందినవారు?
చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి (Indian National Congress) చెందిన నేత.
చింతా మోహన్ ఎన్ని సార్లు ఎంపీగా గెలిచారు?
చింతా మోహన్ మొత్తం ఆరు సార్లు లోకసభకు ఎంపీగా గెలిచారు. ఆయన్ను తిరుపతి నియోజకవర్గం నుంచి ప్రజలు ఎన్నుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: CPI Ramakrishna: విద్యుత్ కార్మికులకు అన్యాయం చేస్తారా!