విజయవాడ: నెక్స్ట్ జెన్ జిఎస్టీ సంస్కరణలు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి వేదికగా అభినందనలు తెలిపారు. ఆదివారం సిఎం చంద్రబాబు ఎక్స్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ఉత్తేజపూరిత ప్రసంగం చేశారంటూ చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెచ్చిన ఈ సంస్కరణలుతో జిఎస్టీ బచత్ ఉత్సవ్ వేడుకలు ప్రారంభించడం సంతోషించ దగిన పరిణామమని సిఎం అభిప్రాయపడ్డారు.

జిఎస్టీ (GST)పన్ను శ్లాబులను 5, 18 శాతానికి మాత్రమే పరిమితం చేయడంతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని సిఎం ఎక్స్లో పేర్కొ న్నారు. 99 శాతం నిత్యావసర వస్తువులు 5 శాతం పరిధిలోకి వస్తాయని దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు, మహిళలు, యువతకు ఈ సంస్కరణల వల్ల లబ్ది చేకూరుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పన్ను విధానాన్ని సరళతరం చేయడంతో ఖర్చులు తగ్గుతాయని.. పెట్టుబడులను ఆకర్షిం చేలా సంస్కరణలను రూపకల్పన చేశారన్నారు. ప్రధాన మంత్రి చెప్పిన నాగరిక్ దేవో భవ అనే మంత్రం దేశ ప్రజలకు అందించే ఓ బహుమతి అని సీఎం అభివర్ణించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: