हिन्दी | Epaper
గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

News Telugu: Chandrababu: ధాన్యం కొనుగోళ్లు సంతృప్తికరం.. 32 శాతం పెరిగిన సేకరణ

Rajitha
News Telugu: Chandrababu: ధాన్యం కొనుగోళ్లు సంతృప్తికరం.. 32 శాతం పెరిగిన సేకరణ

విజయవాడ : రాష్ట్రంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు 32శాతం పెరిగాయని, రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో ఇప్పటివరకు 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు ఈసమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు తెలిపారు. రైతుల సౌకర్యార్థం ఈ కేంద్రాల్లో 7.89 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతులకు రూ.4,085 కోట్లు చెల్లించినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. వేగంగా చెల్లింపులు జరపడంపై సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఆధునిక సాగు యంత్ర పరికరాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంకు ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సాగు వ్యయం తగ్గేలా ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తేవాలని వ్యవసాయ శాఖకు సిఎం దిశానిర్దేశం చేశారు. శాస్త్రీయ విధా నంలో పంటల సాగు ప్రణాళిక, వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు, డ్రోన్ల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గించాలని తద్వారా రైతులకు (formers) ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read also: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ .. కీలక అంశాలపై చర్చ

Paddy procurement is satisfactory

Paddy procurement is satisfactory

32 శాతం అధికంగా కొనుగోళ్లు జరిగినట్టు

ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం కొనుగోళ్లతో పాటు వివిధ పంటల కొనుగోళ్లు, మార్కెటింగ్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు, వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు ముఖ్య మంత్రికి వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 32 శాతం అధికంగా కొనుగోళ్లు జరిగినట్టు తెలియచేశారు. దీనిపై స్పందించిన సిఎం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎన్డీఎ ప్రజాప్రతినిధులు అంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలబడాలని సూచించారు. రబీ సీజన్లో ప్రజలు తినే వెరైటీ వరి సాగుతో పాటు వాటి కొనుగోలు, అంతర్జాతీయంగా మార్కెటింగ్ పై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రాగులు, జొన్న, సజ్జ లాంటి చిరు ధాన్యాల పంటలను సేకరించి వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్నారు.

రైతులకు ధర దక్కేలా చూడాలని

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లకు సంబంధించిన స్లాట్లు కేటాయింపు, ఇతర సాంకేతిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి పత్తి కొనుగోళ్లలో సమస్యల్ని సృష్టించొద్దని సిసిఐకి సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. మిర్చి లాంటి పంటలకు మార్కెట్ కల్పించే విషయంలో వివిధ విశ్లేషణా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 45,420 హెక్టార్లలో సుబాబుల్ సాగైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మార్కెట్ కు అనుగుణంగా సుబాబుల్ రైతులకు ధర దక్కేలా చూడాలని సిఎం సూచనలు జారీ చేశారు. అరటి, నిమ్మ లాంటి ఉద్యాన పంటలకు సంబంధించి కొనుగోలు దారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కనీస మద్దతు ధర దక్కేలా వాణిజ్య పంటల హార్వెస్టింగ్ ప్రక్రియలో రేషనలైజేషన్ విధానాన్ని పాటించాలని.. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు రవాణా ఖర్చులు తగ్గించి అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను అనుసంధానించాలని సిఎం సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు?

బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు?

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా – గుడివాడ అమర్నాధ్

లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా – గుడివాడ అమర్నాధ్

స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి 1.80 కోట్లు మంజూరు: మంత్రి ఆనం

స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి 1.80 కోట్లు మంజూరు: మంత్రి ఆనం

క్యాన్సర్ వ్యాధి నివారణకు అందరూ కృషి చేయండి: డాక్టర్ వి . సుజాత

క్యాన్సర్ వ్యాధి నివారణకు అందరూ కృషి చేయండి: డాక్టర్ వి . సుజాత

తుని సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ లో పొగలు…

తుని సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ లో పొగలు…

కండిషన్ లేని బస్సు.. ప్రయాణీకులకు శాపం

కండిషన్ లేని బస్సు.. ప్రయాణీకులకు శాపం

దావోస్‌లో ఏం జరిగింది? ఐబీఎంతో చంద్రబాబు కీలక భేటీ!

దావోస్‌లో ఏం జరిగింది? ఐబీఎంతో చంద్రబాబు కీలక భేటీ!

పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం

పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం

మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పాత్ర

మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పాత్ర

గొడ్డలితో కేక్ కట్.. పోలీసులు సీరియస్

గొడ్డలితో కేక్ కట్.. పోలీసులు సీరియస్

📢 For Advertisement Booking: 98481 12870