हिन्दी | Epaper
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్

Amaravati : పీ-4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Divya Vani M
Amaravati : పీ-4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Amaravati : పీ-4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం తన జీవిత లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ దిశగా ‘జీరో పావర్టీ పీ-4. మార్గదర్శి-బంగారు కుటుంబం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు అందుబాటులో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.పీ-4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్ అని చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ రంగం, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా పేదరికాన్ని నిర్మూలించేందుకు పనిచేయనున్నారు.ఈరోజు అమరావతిలో సీఎం చంద్రబాబు పీ-4 కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Amaravati పీ 4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
Amaravati పీ 4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పీ-4 లోగోను ఆవిష్కరించారు. అలాగే, పీ-4 కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ([email protected])ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. అదే విధంగా, భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మానుయేల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా మరిన్ని కుటుంబాలను ఎంపిక చేసి, వారి జీవితాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ పథకం ద్వారా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కుటుంబాలు ఈ పథకంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870