తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) లో ఇటీవలి కాలంలో కొంతమంది నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలపై ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు, ప్రజా వేదికలపై పరస్పర విమర్శలు చేసుకోవడం, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలు పార్టీలో అనుచితమని ఆయన స్పష్టం చేశారు. క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై ఎటువంటి సానుభూతి చూపబోమని గట్టిగా హెచ్చరించారు.
Read Also: Minister Farooq: మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న పలువురు ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao), విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Keshineni Chinni) మధ్య బహిరంగంగా నడుస్తున్న వివాదంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారాన్ని తక్షణమే పార్టీ క్రమశిక్షణా కమిటీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.విదేశీ పర్యటనకు వెళ్లే ముందు పార్టీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు (CM Chandrababu) , పలు అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
కొలికపూడి, కేశినేని చిన్ని ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని, వారి నుంచి పూర్తి వివరణ తీసుకుని తనకు నివేదిక సమర్పించాలని క్రమశిక్షణ కమిటీకి సూచించారు. తాను విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక స్వయంగా ఇద్దరితోనూ మాట్లాడతానని, ఆలోగా వివాదం సద్దుమణగకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: