ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజారోగ్యంలో నూతన అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు నేతృత్వంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఆధునీకరణ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించింది. ఈ కేంద్రం రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక ఆరోగ్య సేవలను అందించేందుకు మార్గదర్శిగా నిలవనుంది.

కుప్పం నుంచి ఆరోగ్య డిజిటలైజేషన్కు శ్రీకారం
తన స్వంత నియోజకవర్గమైన కుప్పం (kuppam) లో సీఎం చంద్రబాబు (Chandrababu) తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్ ను ప్రారంభించారు. ప్రముఖ సంస్థ టాటా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం, ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి, వైద్య సేవలను మరింత సులభతరం చేయనుంది.
ప్రాథమిక, గ్రామీణ స్థాయిలో అనుసంధానం
ఈ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పం ఏరియా ఆస్పత్రితో పాటు 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (Primary Health Centres), 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించారు. దీనివల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. సకాలంలో వ్యాధి నిర్ధారణ, స్పెషలిస్ట్ వైద్యుల అపాయింట్మెంట్లు, వ్యక్తిగత కౌన్సెలింగ్ వంటి సేవలను ఈ కేంద్రం అందిస్తుంది.
పూర్తిగా డిజిటల్ ఆరోగ్య డేటా నిర్వహణ
ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో భద్రపరచబడుతుంది. అలాగే అవసరమైన సందర్భాల్లో రోగులకు వర్చువల్ విధానంలోనే వైద్య నిపుణులతో మాట్లాడించి చికిత్స అందించే సౌకర్యం కూడా ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం సేవలను, ప్రైవేటు ఆస్పత్రులను కూడా ఈ నెర్వ్ సెంటర్ ద్వారా అనుసంధానించుకునే అవకాశం కల్పించారు. స్క్రీనింగ్ టెస్టుల నుంచి చికిత్స అనంతర ఫాలో-అప్ల వరకు అన్ని సేవలు ఒకేచోట లభిస్తాయి.
విస్తరణ లక్ష్యాలు – రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ వైద్యం
ప్రస్తుతం కుప్పంలో ప్రారంభమైన ఈ సేవలను, రెండో దశలో చిత్తూరు జిల్లా అంతటికీ, మూడో దశలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంతో ప్రజారోగ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
Read also: Chevireddy Bhaskar Reddy: లిక్కర్ కేసులో మూడో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి