हिन्दी | Epaper

Iftar Dinner విజయవాడలో ఇఫ్తార్ విందు… హాజరైన సీఎం చంద్రబాబు

Sudheer
Iftar Dinner విజయవాడలో ఇఫ్తార్ విందు… హాజరైన సీఎం చంద్రబాబు

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం విజయవాడలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై, ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు.

ముస్లిం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ముస్లిం సోదరుల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కూటమి పాలనలో ప్రతి ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల సాధించేలా అన్ని విధాలుగా సహాయపడతామని భరోసా ఇచ్చారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.

chandrababu attends iftar
chandrababu attends iftar

వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ

ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీ సమాజానికి చెందిన సమస్త వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు, వాటిని సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. గత పాలకుల కాలంలో వక్ఫ్ ఆస్తులు దోచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పేదల కోసం ‘పీ4’ అమలు

పేదల అభివృద్ధే తన ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. పేదవారిని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురావడమే తన జీవన ఆశయమని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 30న ‘పీ4’ అమలు ప్రారంభించనున్నామని చెప్పారు. ముస్లింల అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

జనావాసాలకు సురక్షిత మంచినీరు లక్ష్యం.. డి.సిఎం పవన్

జనావాసాలకు సురక్షిత మంచినీరు లక్ష్యం.. డి.సిఎం పవన్

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా లీసా గిల్

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా లీసా గిల్

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం

కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు

సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు

📢 For Advertisement Booking: 98481 12870