ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో విద్యారంగం మరింత బలపడుతోంది. ప్రముఖ విద్యాసంస్థ బిట్స్ పిలానీ (BITS Pilani) ఇప్పుడు అమరావతిలో తమ సరికొత్త క్యాంపస్ను రూ.1000 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నట్లు ఆ సంస్థ ఛాన్సలర్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. ఈ ప్రకటన విద్యార్థులలో ఉత్సాహం నింపుతోంది.
AI ఆధారిత విద్యా కేంద్రంగా అభివృద్ధి
ఇది సాధారణ విద్యా సంస్థ కాదని, అత్యాధునిక AI+ క్యాంపస్గా దీనిని అభివృద్ధి చేస్తున్నామని బిర్లా తెలిపారు. ఈ క్యాంపస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి రంగాల్లో ప్రత్యేక కోర్సులు నిర్వహించనున్నారు. అంతేకాక, పరిశోధన, పరిశ్రమలతో ఇంటర్న్షిప్స్, ఆంత్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, జాయింట్ PhDs వంటి అవకాశాలూ విద్యార్థులకు అందుబాటులో ఉండనున్నాయి.
7,000 మంది విద్యార్థులకు ఉపాధ్యాయ కేంద్రం
ఈ AI+ క్యాంపస్ సామర్థ్యం దాదాపు 7,000 మంది విద్యార్థులకు ఉండనున్నట్లు బిర్లా వెల్లడించారు. ఇది తెలుగురాష్ట్రాల్లో అత్యున్నత విద్యకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. అమరావతిలో ఇలాంటి శాస్త్రీయ, సాంకేతిక విద్యా సంస్థల ఏర్పాటు రాష్ట్ర విద్యారంగ అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా నిలవనుంది. విద్యార్థులకి ప్రపంచ స్థాయి అవకాశాలు, పరిశోధనకు మార్గాలు అందించేందుకు ఈ క్యాంపస్ సహాయపడనుంది.
Read Also : Amaravathi : రాజధానిలో పలు సంస్థలకు భూముల కేటాయింపు