Bill Gates: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో(CM Chandrababu) భేటీ అయ్యారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్పై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
Read Also: Bill Gates: అమరావతిలో బిల్ గేట్స్.. చంద్రబాబుతో భేటీలో కీలక చర్చలు

1997లో తొలిసారి బిల్ గేట్స్ను కలిశాను
1997లో తాను తొలిసారి బిల్ గేట్స్ను కలిసి ఐటీ రంగానికి సంబంధించిన తన విజన్ను పంచుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పుడు ఆయనకు నా ఐటీ విజన్ను వివరించాను. ఆ రోజు ఒక టెక్నాలజీ ఎకోసిస్టమ్ను నిర్మించడంపై మా మధ్య మొదలైన సంభాషణ, ఇప్పుడు ఒక విస్తృత లక్ష్యంగా రూపాంతరం చెందింది. వినూత్న ఆవిష్కరణలను ఉపయోగించి పాలనలో మార్పులు తీసుకురావడం, ప్రజల జీవితాలను పెద్ద ఎత్తున మెరుగుపరచడమే ఆ లక్ష్యం.
ఈ రోజు అమరావతి సచివాలయంలో ఆయనతో మరోసారి భేటీ అయ్యాను. ఈ సందర్భంగా, నా స్వర్ణాంధ్ర 2047 విజన్ను ఆయన ముందు ఉంచాను. ఈ సమావేశంలో మా మంత్రులు, కార్యదర్శులు కూడా పాలుపంచుకుని ఆయనతో సంభాషించారు. ఆనాటి మా సంభాషణ నేటి మా విస్తృత లక్ష్యాలకు పునాది వేయడం సంతోషంగా ఉంది అని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: