వేగం కన్నా ప్రాణం మిన్న..స్పీడ్ ట్రీల్స్..బట్ లైఫ్ కిల్.. ఇలాంటి స్లోగన్లను పోలీసులు రోడ్డుపై పెడుతూనే ఉంటారు. వాహనదారుల భద్రత కోసం ఎన్నో కోట్లను ఖర్చుపెట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రమాదాలు ఆగడం లేదు.. ప్రాణాలు దక్కడం లేదు. నిర్లక్ష్యం.. వేగం.. నిద్రమత్తు.. మద్యంమత్తు కారణాలు ఏవైనా పోయేది ప్రాణాలే కదా. ఆ కుటుంబాలకు అంతులేని
దుఃఖమే కదా మిగిలేది. బాపట్ల పట్టణంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు(Bapatla crime) ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద అతివేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ లారీని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Read also: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ ట్రైలర్ రిలీజ్

గాల్లో ఎగిరి రోడ్డుపై పడి, దుర్మరణం
గుంటూరు జిల్లా(Guntur District) కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్ (21), చింతల నాని (21) స్నేహితులు. వీరిద్దరూ బుధవారం రాత్రి బైక్ పై సూర్యలంక బీచ్ కు వెళ్లారు. అయితే, బీచ్ మూసి ఉండటంతో తిరిగి గుంటూరుకు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో అర్థరాత్రి 2.34గంటల సమయంలో బాపట్ల గడియారం స్తంభం కూడలి వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో చీరాల నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఓ లారీని(Bapatla crime) వీరి బైక్ బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాఆనికి బైక్ అతివేగమే కారణమని తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్ తో ప్రాణాలు కోల్పోయిన రెండు కుటుంబాల తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చారు. చిన్న జాగ్రత్త పెద్ద ప్రాణాలు రక్షించబడతాయి. ఈ చిన్న నిర్లక్ష్యం ఖరీదు వెలకట్టలేనంతది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: