బాపట్ల(Bapatla) జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో నివసిస్తున్న చిట్టి బోయిన అంజయ్య, వెంకయమ్మ దంపతుల పూరి గుడిసె అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి, బట్టలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయి, కుటుంబం అన్నిటినీ కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Read also: Kethireddy: యుద్ధం ముగిసిందని తెలియదు: మాజీ ఎమ్మెల్యే
ఈ విషయం తెలుసుకున్న మార్టూరు హెల్పింగ్ హాండ్స్(Helping Hands Martur) స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ వలి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో రూ.10 వేల నగదు సహాయంతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని వారు హామీ ఇచ్చారు.

అగ్నికి ఆహుతైన కుటుంబానికి రూ.10 వేల సాయం
అదేవిధంగా, మార్టూరు మండలంలోని రాజుపాలెం అసిస్ట్ కాలనీకి చెందిన గుంజి నాగేంద్రమ్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో, ఆమె వైద్య ఖర్చులకు తోడ్పాటుగా మరో రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని హెల్పింగ్ హాండ్స్ సంస్థ అందజేసింది. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఆమెకు ఈ సహాయం ఎంతో ఊరట కలిగించిందని స్థానికులు పేర్కొన్నారు. మార్టూరు హెల్పింగ్ హాండ్స్ సంస్థ సమాజ సేవకు ఎప్పుడూ ముందుంటుందని, పేదలు, బాధితుల కోసం ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: