Telugu News: Atchannaidu:ఉల్లి రైతులకు హెక్టారుకు ₹50,000 ఆర్థిక సాయం

Read Time:  1 min
Atchannaidu
Atchannaidu
FONT SIZE
GET APP

ఉల్లి పంటకు సరైన ధరలు రాక నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మేరకు హెక్టారుకు ₹50,000 చొప్పున సాయం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ(Department of Agriculture) మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) ప్రకటించారు. 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం మొత్తం కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది ఉల్లి రైతులు ఈ సహాయానికి అర్హులని తెలిపారు. ఈ పథకం కింద ప్రభుత్వం ₹104.57 కోట్లు విడుదల చేయనుంది. రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని తగ్గించడమే ఈ చర్య ఉద్దేశమని మంత్రి(Atchannaidu) వివరించారు.

Atchannaidu
Atchannaidu

Read also:  TTD: తిరుపతిలో శ్రీవారి సారె ఊరేగింపు

ధరలు పడిపోయినప్పుడు కూడా మద్దతు
ఉల్లి ధరలు తగ్గిన సమయంలో ప్రభుత్వం క్వింటాలుకు ₹1,200 చొప్పున రూ.18 కోట్ల విలువైన ఉల్లిని కొనుగోలు చేసిందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ఇప్పటికే రైతులకు ₹10 కోట్లు విడుదల చేయగా, మరో ₹8 కోట్లు త్వరలో చెల్లించనున్నట్లు తెలిపారు. ఉల్లి ధరల పతనం వల్ల నష్టపోయిన రైతులు ఇబ్బంది పడకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో పంటల ధరలను స్థిరంగా ఉంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.

Atchannaidu
Atchannaidu

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.