ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), మాజీ సీఎం జగన్మోహ (Jaganmohan Reddy)న్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కానూరు సివిల్ సప్లై భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ అవగాహన లేకుండా, నిరుత్తరంగా అబద్ధాల ప్రచారమే చేస్తున్నారని మండిపడ్డారు.రైతుల కోసం మీరు ఏం చేశారో చెప్పగలరా? అంటూ మంత్రి సూటిగా సవాల్ విసిరారు. ప్రజలు ఐదేళ్లకోసారి అధికారం ఇస్తారని జగన్ మరిచిపోయారని విమర్శించారు. ఐదేళ్లు పాలించి గుంతలు కూడా పూడ్చలేకపోయిన వారు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.మద్యపాన నిషేధం, అమ్మఒడి వంటి హామీలను జగన్ ఎందుకు విస్మరించారో చెప్పాలని నిలదీశారు. తమ ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తోందని స్పష్టం చేశారు.

రైతులకు రూ.12 వేల కోట్లు పంపిణీ
కూటమి ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.12,857 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిందని వెల్లడించారు. అందులో రూ.12 వేల కోట్లు 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మిగిలిన రూ.1,000 కోట్లు 40 రోజుల్లో చెల్లించామని వివరించారు.జగన్ ధాన్యం బకాయిలు బాగా తెలియకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు గూగుల్ లేదా ఏఐ సమాచారం ద్వారా నిజాలు తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వం గోదావరిలో క్రాఫ్ హాలిడే ప్రకటించి రైతులను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు.
జగన్ పర్యటనలపై తీవ్ర వ్యాఖ్యలు
బెంగళూరులో ఉంటూ నెలకు ఒకసారి పర్యటన పేరుతో రచ్చ చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మద్దతు కోల్పోయిన జగన్ రాజకీయ లబ్ధికోసం చిత్తూరులో చీలికలు తెస్తున్నారని అన్నారు. జగన్కు ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చారని, కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని గుర్తు చేశారు.పంటలను రోడ్డుపై తొక్కించడం జగన్ పాలన దారుణాన్ని చూపిస్తుందన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం వాస్తవిక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. శాంతిభద్రతలు, సంక్షేమం, అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
దీపం-2 పథకం ద్వారా ఉచిత గ్యాస్
“దీపం-2” పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. దీన్ని 2024 అక్టోబర్ 31న శ్రీకాకుళంలో ప్రారంభించామని చెప్పారు. మొదటి విడతలో రూ.846 కోట్లు ఖర్చుతో 97 లక్షల మందికి, రెండో విడతలో రూ.712 కోట్లతో 91.10 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించామని వివరించారు.ఈ వ్యాఖ్యలతో మంత్రి మనోహర్, జగన్ పాలనపై ప్రజల్లో నిజాలు బయటపెట్టే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుందని స్పష్టంచేశారు.
Read Also : CM Chandrababu: కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు