No myths on Smart Meters: స్మార్ట్ మీటర్ల పట్ల వినియోగదారులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (CMD) శివశంకర్ లోతేటి స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ‘కరెంటోళ్ళ జనబాట’ కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం తిరుపతి జిల్లా, బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కొత్తపాలెం గ్రామంలో పర్యటించారు.
Read Also: Deworming Tablets: చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరి: హిమాన్షు శుక్ల
క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన
కొత్తపాలెం గ్రామంలో విద్యుత్ పునర్వ్యవస్థీకరణ పంపిణీ పథకం (RDSS) కింద పూర్తయిన పనులను సీఎండీ స్వయంగా పరిశీలించారు. అనంతరం స్థానిక వినియోగదారులతో నేరుగా మాట్లాడి, విద్యుత్ సరఫరాలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.
No myths on Smart Meters: స్మార్ట్ మీటర్ల ప్రాముఖ్యత
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, భవిష్యత్తు అంతా స్మార్ట్ మీటర్లదేనని, వీటి వల్ల వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.
- స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
- రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను భారీగా ఆదా చేసుకోవచ్చు.
- సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిబ్బంది నిరంతరం కృషి చేయాలి.
‘కరెంటోళ్ళ జనబాట’ – పరిష్కార వేదిక
సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో అధికారులు మరియు సిబ్బంది నిర్దేశిత గ్రామాల్లో పర్యటిస్తారని శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారుల దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: