AP: విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా పెందుర్తిలో చోటుచేసుకున్న ఘోర ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. కుటుంబ కలహాలను తట్టుకోలేక ఓ కోడలు తన అత్తను సజీవదహనం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేపగుంట అప్పన్నపాలెంలోని వర్షిణి అపార్టుమెంట్లో నివసిస్తున్న లలితాదేవి (30) తన అత్త కనకమహాలక్ష్మి (63)పై హత్యా ప్రణాళిక వేసింది. భర్త ఇంట్లో లేని సమయంలో లలితాదేవి, అత్తను పిల్లలతో కలిసి ‘దొంగా పోలీస్’ ఆట ఆడుదామని నమ్మించింది. ఆటలో భాగంగా కనకమహాలక్ష్మి చేతులు, కాళ్లు కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటల్లో చిక్కుకున్న అత్త అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న మనవరాలు శ్రీనయనకు గాయాలయ్యాయి.
Read also: Montha: మొంథా తుఫాన్ ప్రభావంపై కేంద్ర బృందాల పర్యటన

AP: యూట్యూబ్ ప్రభావం.. అత్తను చంపిన కోడలు
హత్య ఎలా చేయాలి నేరం చేసి తప్పించుకోవడం ఎలా?
AP: ఘటనను ప్రమాదంగా చూపేందుకు లలితాదేవి నాటకం ఆడింది. టీవీ పేలిపోయి అగ్నిప్రమాదం జరిగిందని అరుస్తూ పొరుగువారిని పిలిచింది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పెట్రోల్ వాసన రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తులో భాగంగా లలితాదేవి ఫోన్ను పరిశీలించిన పోలీసులు, ఆమె యూట్యూబ్లో ‘హత్య ఎలా చేయాలి’, ‘నేరం చేసి తప్పించుకోవడం ఎలా’ అనే వీడియోలు సర్చ్ చేసినట్లు గుర్తించారు. విచారణలో ఆమె నేరాన్ని ఒప్పుకుని, అత్త నిరంతరం చాదస్తంగా ప్రవర్తించడంతో కోపం వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: