(AP) విశాఖకు మరిన్ని పెట్టుబడుల ఆకర్షించడంపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో మరో ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్తో పాటు, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ తమ క్యాంపస్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా విశాఖలో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడులు రానుండగా, ప్రత్యక్షంగా 33 వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యాలయాల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎంతో పాటు ఐటీ మంత్రి నారా లోకేశ్, ఐటీ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు.
Read Also: Prakasam district: టోల్ గేట్ల వద్ద మోసం: నకిలీ MLA స్టిక్కర్తో తిరుగుతున్న డ్రైవర్ అరెస్ట్
ఉపాధి అవకాశాలు
కాగ్నిజెంట్ సంస్థ రూ.1,583 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో ఈ క్యాంపస్ను నిర్మించనుంది. దీని ద్వారా 8 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2033 నాటికి నిర్మాణం పూర్తి కానుండగా, మొదటి దశను 2029 నాటికి పూర్తి చేసి 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.

ఈ నేపథ్యంలో, రుషికొండలోని మహతి ఫిన్ టెక్ భవనంలో వెయ్యి సీటింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభిస్తారు. ఈ కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలపై దృష్టి సారిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: