ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 13 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు సోషల్ మీడియా (Social_media) వాడకాన్ని పూర్తిగా అందుబాటులో లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
Social Media: కర్ణాటక సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బంద్!

Social media ban for young children in AP
90 రోజుల్లో కొత్త నిబంధనలు అమలు
ఈ నిషేధాన్ని అమలు చేయడానికి అవసరమైన విధివిధానాలను రాబోయే 90 రోజుల్లో ఖరారు చేస్తామని సీఎం ప్రకటించారు. సాంకేతికత వల్ల పిల్లలు తప్పుదోవ పట్టకుండా, వారి చదువుపై దృష్టి పెట్టేలా ఈ మార్పులు తీసుకురానున్నారు. దీనికోసం ప్రత్యేక చట్టం లేదా నిబంధనలను రూపొందించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు.
16 ఏళ్ల వరకు నిషేధం పొడిగింపు అవకాశం
ప్రస్తుతం 13 ఏళ్లుగా ఉన్న ఈ వయసు పరిమితిని, అందరి ఆమోదంతో 16 ఏళ్ల వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. సోషల్ మీడియా వల్ల పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదని సీఎం నొక్కి చెప్పారు. సమాజంలోని మేధావులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే సూచనల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: