ఇటీవలి వర్షాలతో గుంటూరు నగరంలోని అనేక రహదారులు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నగర పాలక సంస్థ అత్యాధునిక రోడ్ డాక్టర్ మెషీన్ను మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చింది. రూ.1.50 కోట్ల వ్యయంతో కొన్న ఈ యంత్రాన్ని నిపుణులైన సిబ్బంది కొరత వల్ల ఇప్పటివరకు ఉపయోగించలేదు. అయితే ప్రస్తుతం నగరంలో గుంతల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో, ఈ వాహనాన్ని నిర్వహణకు ప్రత్యేక ఏజెన్సీకి అప్పగించారు. చదరపు మీటరు మరమ్మతుకు రూ.1,370 చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మెషీన్తో రోజులో చిన్న గుంతలు 15 వరకు, పెద్ద గుంతలు 10 వరకు పూడ్చే సామర్థ్యం ఉంది. కలెక్టరేట్ రోడ్, పట్టాభిపురం, రింగురోడ్డు, కంకరగుంట వంటి ప్రధాన ప్రాంతాల్లో ఇప్పటికే పనులు ప్రారంభించారు.
Read also: AP: కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ప్రభుత్వ టీచర్లకు గుడ్న్యూస్..

AP Road: With ‘Road Doctor’.. smooth roads now!
వాహనదారులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా
రోడ్ డాక్టర్ మెషీన్ పనిచేసే విధానం సాధారణ మరమ్మతులతో పోలిస్తే వేగంగా మరియు మన్నికగా ఉంటుంది. ముందు గుంతను శుభ్రం చేసి ఎమల్షన్ పోసి, యంత్రంలో ఉండే ప్రత్యేక కోల్డ్ మిక్స్ బీటీని నింపుతారు. తర్వాత తారను కరిగించి వైబ్రేటర్తో చదును చేస్తారు. చివరగా మళ్లీ ఎమల్షన్, డస్ట్ వేసి గుంతను పూర్తిగా పూడుస్తారు. ఇలా స్మూత్గా మరమ్మతయిన రోడ్లు వాహనదారులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. రెండు షిఫ్టుల్లో 12 మంది సిబ్బంది పనిచేసే ఈ యంత్రాన్ని ఇటీవల తిరుపతిలో కూడా ఉపయోగించారు. డిసెంబర్ నాటికి మొత్తం నగర రహదారుల్లో పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :