ఉపరితల ఆవర్తనం వల్ల వాతావరణ మార్పులు
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణ(AP Rain update)ఆంధ్ర లో బారి వర్షాలు పరిస్థితుల్లో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకున్నాయి. సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ కారణంగా శనివారం (11వ తేదీ) ఉత్తరాంధ్రలోని (North andhra) పలు జిల్లా పరిధుల్లో పిడుగులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు.
ప్రభావిత జిల్లాలుగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాలు ఉంటాయని తెలిపారు. వర్షాల సమయంలో చెట్లు లేదా తెరచిన ప్రదేశాల వద్ద నిలబడరాదని, పిడుగుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
Read also: పెళ్లి రూమర్స్ పై స్పందించిన త్రిష

వర్షపాతం వివరాలు మరియు హెచ్చరికలు
శుక్రవారం సాయంత్రం వరకు నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం, కోనసీమ జిల్లా నగరంలో 46 మిల్లీమీటర్లు, మలికిపురంలో 36.2 మిల్లీమీటర్లు వర్షపాతం(AP Rain update)ఆంధ్ర లో బారి వర్షాలు నమోదైంది. ప్రకాశం జిల్లా నర్సింగోలులో 27 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా డి.పోలవరంలో 25.5 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా అంబాజీపేటలో 21.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ప్రఖర్ జైన్ తెలిపారు.
ప్రస్తుతం వాతావరణం మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, అధికారులు పౌరులను అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు విపత్తు నిర్వహణ హెల్ప్లైన్లను సంప్రదించాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: