అమరావతిని(AP) ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం సాఫల్యమైన ప్రణాళికలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రెండో విడత భూ సమీకరణకు కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. మొత్తం ఏడు గ్రామాల్లో సుమారు 16,666 ఎకరాలను సమీకరించాలన్న నిర్ణయం తీసుకుంది. అయితే భూ సమీకరణ ప్రక్రియ ముందుకు సాగేముందు, అమరావతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ లక్ష్యంతో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సీఆర్డీఏ అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమగ్రంగా సమీక్షించింది.
Read also: బైడెన్ ఆ ఆదేశాలన్నీ రద్దు చేసిన ట్రంప్

రైతుల హెల్త్ కార్డులు పింఛన్లకు ఒక నెలలో పరిష్కారం
సమావేశం అనంతరం(AP) కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. 38 వేల మందికి ఆరోగ్య కార్డులు జారీ చేసినట్లు, అందులో దాదాపు పదివేల మంది వాటిని వినియోగించుకున్నట్లు పెమ్మసాని తెలిపారు. హెల్త్ కార్డులు, పింఛన్లకు సంబంధించిన పెండింగ్ సమస్యలను ఒక నెలలోపు సరిచేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా 200 కేవీ, 400 కేవీ పవర్ లైన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. 400 కేవీ లైన్ల పనులు 2026 అక్టోబర్ 8 నాటికి పూర్తవుతాయని చెప్పారు.
ఇదిలా ఉండగా, ప్లోట్ కేటాయింపుల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కోర్టులలో ఉన్న భూమి కేసులు పరిష్కారం అయ్యేంత వరకూ రైతులు ఓపికగా ఉండాలని సూచించారు. గ్రామ కంఠాలు, జరీబ్ భూములపై మళ్లీ క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నియమావళిని ఉల్లంఘించి పొందిన గ్రామ కంఠాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: