గిరిజనుల (AP)ఆదాయ మార్గాలను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, గిరిజన అభివృద్ధి, ఎకో టూరిజం అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అటవీ మరియు ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న డిమాండ్ను ఉపయోగించుకుని, వాటి తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా గిరిజనుల ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని ఆయన తెలిపారు. ఏజెన్సీలోని జలపాతాలు, అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, పర్యాటకం ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
Read also: పెరిగిన రీఛార్జ్ ధరలు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యూజర్లు

ఉపాధి హామీ అనుసంధానం: సినిమా షూటింగ్ల ప్రోత్సాహం
ఏజెన్సీ(AP) ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తో అనుసంధానం చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనివల్ల రైతులకు, కూలీలకు లబ్ధి చేకూరి, ఏజెన్సీలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో సినిమా, ఓటీటీ (OTT) ప్రాజెక్టుల షూటింగ్లను ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించవచ్చని తెలిపారు. గంజాయి సాగు నిర్మూలన అంశాన్ని కూడా సమీక్షించిన పవన్ కల్యాణ్, గిరిజనులు అటువైపు వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. గిరిజనుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ప్రతి నెలా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: