AP: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, (Nara lokesh) ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ ఫిరోజ్ బాషా కృషిని ప్రశంసించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు ప్రధాన పాఠశాలలో బోధిస్తున్న ఆయన, విద్యార్థులకు డిజిటల్ ప్రింటింగ్లా అందమైన చేతిరాత నేర్పిస్తున్నారని మంత్రి ట్వీట్ ద్వారా అభినందించారు. ఫిరోజ్ బాషా ప్రతిరోజూ పాఠశాలకు ముందుగానే వచ్చి, సాయంత్రం అదనపు సమయం కేటాయించి విద్యార్థులకు బోధించడం ప్రేరణాత్మకమని లోకేశ్ పేర్కొన్నారు.
Read also: Tirumala Laddu: నెయ్యి పేరుతో మోసం – తిరుమల లడ్డూ కల్తీ బయటపడ్డది
మీ అంకితభావానికి హ్యాట్సాఫ్
AP: “మీరు పిల్లలకు నేర్పిన తెలుగు, ఇంగ్లిష్ హ్యాండ్రైటింగ్ అద్భుతంగా ఉంది. మీ అంకితభావానికి హ్యాట్సాఫ్,” అని ట్వీట్లో రాశారు. విద్యార్థుల్లో సబ్జెక్టులపై ఆసక్తి పెంపొందించడానికి ఆటపాటలతో బోధించే ఫిరోజ్ బాషా పద్ధతి ఫలితంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200కి చేరిందని ఆయన తెలిపారు. ఇలాంటి మార్పులే ప్రభుత్వ పాఠశాలల్లో చూడాలని తాను ఆశిస్తున్నానని లోకేశ్ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: