కౌంటరు దాఖలు చేయాలని సిట్ కు ఆదేశం
విజయవాడ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు హాజరయ్యే ందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో అరెస్టయిన(AP) వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ సిట్ను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్పై తదుపరి విచారణ నవంబర్ 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం స్కాంలో ఏ4గా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయన్ని ఈ ఏడాది జులై 19వ తేదీన సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన్ని దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నాటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంతో తన ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అందుకు షరతులతో కూడిన బెయిల్ను ఆయనకు ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఇక న్యూయార్క్ వెళ్తున్న ఎంపీల ప్రతినిధి బృందంలో ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్రం చోటు కల్పించింది.
Read also: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల ఎంసీఎక్స్ తాజా వివరాలు

ఏసీబీ కోర్టు సిట్ కు కౌంటర్ దాఖలు ఆదేశం
ఈ పర్యటనకు వెళ్లేందుకు అనుమితి ఇవ్వాలంటూ మరోసారి(AP) ఏసీబీ కోర్టును ఆయన ఆశ్రయించారు. షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఆయన న్యూయార్క్లో పర్యటించారు. తనకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Mithun Reddy) విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ సిట్ను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్పై తదుపరి విచారణ నవంబర్ 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం స్కాంలో ఏ4గా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయన్ని ఈ ఏడాది జులై 19వ తేదీన సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన్ని దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నాటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంతో తన ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అందుకు షరతులతో కూడిన బెయిల్ను ఆయనకు ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఇక న్యూయార్క్ వెళ్తున్న ఎంపీల ప్రతినిధి బృందంలో ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్రం చోటు కల్పించింది. ఈ పర్యటనకు వెళ్లేందుకు అనుమితి ఇవ్వాలంటూ మరోసారి ఏసీబీ కోర్టును ఆయన ఆశ్రయించారు. షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఆయన న్యూయార్క్లో పర్యటించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: