हिन्दी | Epaper
ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్

Latest news: Ap: శ్రీశైలం లో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

Saritha
Latest news: Ap: శ్రీశైలం లో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

ప్రధాని మోదీ శ్రీశైలంలో మల్లన్న సేవలో భాగమయ్యారు

ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)అక్టోబర్ 16న ప్రత్యేక పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌(Ap)రాష్ట్రానికి చేరుకున్నారు. ఉదయం 9.55 గంటలకు ఆయన కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ చేరుకోగా, అక్కడినుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో కలిసి శ్రీశైలానికి వెళ్లారు.

శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రధానికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఇదే సందర్భంగా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ప్రధానిగా శ్రీశైలానికి విచ్చేసిన నాలుగో నేతగా మోదీ గుర్తింపు పొందారు. గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు.

Read also: మంటల్లో చిక్కుకున వాహనాలు నలుగురు సజీవ దహనం

AP

కర్నూలులో భారీ బహిరంగ సభ – రూ.13,429 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన

శ్రీశైలం పూజల అనంతరం మోదీ మధ్యాహ్నం 2.20కి మళ్లీ కర్నూలుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నన్నూరులో ఏర్పాటైన ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభకు హాజరయ్యారు. సుమారు 450 ఎకరాల్లో ఈ సభా వేదికను ఏర్పాటుచేశారు. మూడు లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా. ఈ సభలో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు,(AP) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, టీజీ భరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు ప్రసంగించారు. వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మరియు చేపట్టబోయే రూ.13,429 కోట్ల విలువైన రవాణా, విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమల రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట రోడ్‌ షోగా ప్లాన్ చేసిన కార్యక్రమాన్ని భద్రతా కారణాలతో సభగా మార్చారు. సభ అనంతరం ప్రధాని మోదీ సాయంత్రం 4.45కి ఢిల్లీకి తిరిగిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870