ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) ఆదివారం ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. కొత్త పెట్టుబడుల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నవారిని లక్ష్యంగా, “క్షమించండి, ఈ రోజు ఆదివారం… మాకు సెలవు! ఇండియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ చూస్తున్నాం” అని సరదాగా చెప్పారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖపట్నంలోని మూడు రోజుల CII భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి పెద్ద విజయం అందించింది. సదస్సు ముగిశాక మొత్తం 613 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రవహించనున్నాయి.
Read also: Ramoji rao: రామోజీరావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు

AP: పెట్టుబడుల ప్రకటనపై మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్
లోకేశ్ ట్వీట్ ద్వారా
ఈ ఒప్పందాల ద్వారా భవిష్యత్తులో సుమారు 16 లక్షల మందికి పైగా యువతకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సదస్సు విజయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రత్యేక కృషి ఫలితమని అనేక విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ కొత్త పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికవృద్ధికి కీలకంగా నిలవనున్నాయి. లోకేశ్ ట్వీట్ ద్వారా ఈ విజయాన్ని కొంత సరదా ధోరణిలో కూడా ప్రజలతో పంచుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: