Latest news: AP Liquor Scam: చెవిరెడ్డి కుంటుంబ ఆస్తులు జప్తు

Read Time:  1 min
AP Liquor Scam
AP Liquor Scam
FONT SIZE
GET APP

ఏపీ మద్యం కుంభకోణంలో కొత్త పరిణామాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం(AP Liquor Scam) దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌లో భాగంగా నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(Chevireddy Bhaskar Reddy) మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి పేర్లతో ఉన్న ఆస్తులను జప్తు చేయడానికే ఆదేశాలు జారీ అయ్యాయి.

Read also: ఢిల్లీ ఆత్మాహుతి దాడిని బలిదానంగా అభివర్ణించిన అసదుద్దీన్ ఒవైసీ

AP Liquor Scam
Chevireddy family assets seized

చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తు ప్రక్రియ

సిట్ (SIT) చెవిరెడ్డి కుటుంబం(AP Liquor Scam) అక్రమంగా భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. ఈ కుటుంబం రూ. 54.87 కోట్లు నల్లధనంగా మార్చినట్లు వెల్లడైంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని విలువైన ఆస్తులను జప్తు చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. అవినీతి నిరోధక చట్టాల ప్రకారం, ఈ ఆస్తుల జప్తు ప్రామాణికతను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.