हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: AP: కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించాలి

Rajitha
News Telugu: AP: కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించాలి

రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ ఆదేశం ఏలూరు : కొల్లేరు (kolleru lake) అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిఫుల్ కన్జర్వేటర్ డా. పి.వి. చలపతిరావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల అటవీ, రెవిన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కొల్లేరు అభయారణ్యం, సుప్రీం కోర్ట్ ఏర్పాటుచేసిన కేంద్ర సాధికార కమిటీ కొల్లేరు అభయారణ్యంలో కొన్ని అంశాలపై నివేదికలు కోరిన అంశాలపై అధికారులతో చలపతిరావు సమీక్షించారు.

AP: కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించాలి

AP: కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించాలి

Read also: AP: త్వరలోనే ఎన్టీఆర్‌ బేబీ కిట్లు

ఈ సందర్భంగా చలపతి రావు మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను అభయారణ్యం రూపొందించినప్పుడు ఉన్న రికార్డులతో ప్రస్తుతం ఆధునిక లిడార్ సర్వే టెక్నాలజీ ద్వారా గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. కొల్లేరు అభయారణ్య పరిధిలో జిరాయితీ, డి. ఫారం పట్టా భూములు వివరాలతో పాటు, ఇటీవల కొల్లేరు ప్రాంతంలో పర్యటించిన సుప్రీంకోర్ట్ నియమించిన కేంద్ర సాధికార కమిటీ కొల్లేరు అభయారణ్యంపై కొన్ని అంశాలపై నివేదికలు సమర్పించాల్సిందిగా ఆదేశించిందని, వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి వాటిపై నివేదికలను వెంటనే సమర్పించాలని డా.చలపతి రావు అధికారులను ఆదిదేశించారు.

ఉప్పుటేరు సరిహద్దులను గుర్తించి

కొల్లేరు ప్రాంతంలో నీటి నిర్వహణకు బాధ్యత వహించే నీటి పారుదల శాఖ కొల్లేరు సరస్సు ప్రాంతం వివరణాత్మక కాంటూర్ మ్యాప్ లను అందించాలని ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీరన్ను డా. చలపతిరావు ఆదేశించారు. ఉప్పుటేరు సరిహద్దులను గుర్తించి నివేదికలు సమర్పించాలని, దీని కారణంగా కొల్లేరు ప్రాంతంలో వరదలను నియంత్రించేందుకు ఆక్రమణలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు అభిషేక్ గౌడ, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ శాఖాధికారి బి. విజయ, ఏలూరు జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వర రావు, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ శేషుబాబు, ఎస్ఈ దేవప్రకాష్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమేష్, డిపిఓ అనురాధ, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ త్రినాథ్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870