हिन्दी | Epaper

News Telugu: AP: తుఫాను ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్.. విధించిన ఆంక్షలు ఇవే!

Rajitha
News Telugu: AP: తుఫాను ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్.. విధించిన ఆంక్షలు ఇవే!

AP: కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ (jagan mohan reddy) రెడ్డి పర్యటనకు పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. ‘మొంథా’ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించనున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. గతంలో జరిగిన అనుకోని ఘటనలను దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జగన్ పర్యటనకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ సమయంలో ఆయన గూడూరు మండలంలోని రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామాలను సందర్శించనున్నారు.

News Telugu: Breaking News – Vizag: నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న జగన్

AP: తుఫాను ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్..

AP: తుఫాను ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్..

AP: కాన్వాయ్‌లో గరిష్ఠంగా 10 వాహనాలు మాత్రమే ఉండాలనీ, మొత్తం 500 మందికి మించి ఎవరినీ అనుమతించరాదని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే రహదారులపై ర్యాలీలు, భారీ గుమికూడింపులు, సమావేశాలు లేదా డీజేల వినియోగం నిషేధించారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ నిబంధనలను అతిక్రమించినా లేదా అనుమతిని దుర్వినియోగం చేసినా పర్యటనను తక్షణమే రద్దు చేస్తామని హెచ్చరించారు. పర్యటన సమయంలో జరిగే ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టానికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలని పోలీసు అధికారులు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

📢 For Advertisement Booking: 98481 12870