ఆంధ్రప్రదేశ్లో(AP) ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఇంటర్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం మరోసారి అవకాశం కల్పించినట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఫీజు చెల్లించే గడువు ముగిసినప్పటికీ, ఇంకా ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాత్కాల్ స్కీమ్(AP Intermediate) కింద రూ. 5 వేల ఫైన్తో జనవరి 5, 2026 వరకు ఫీజు చెల్లించుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే గడువు ముగిసినప్పటికీ, ఈ అవకాశాన్ని మిగిలిపోయిన విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించింది. దీని తర్వాత ఎలాంటి గడువు పొడిగింపు ఉండదని బోర్డు స్పష్టం చేసింది.
Read also: Pawan Kalyan: కులాల రాజకీయాలపై పవన్ ఘాటు వ్యాఖ్యలు

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: