AP: అమరావతిలో చరిత్రాత్మకంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Read Time:  1 min
AP
AP
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం 2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను అమరావతిలో ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రజల రాజధానిగా భావిస్తున్న అమరావతిలో ఈ వేడుకలు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Read Also: TDP Joining: వైసీపీకీ భారీ షాక్ ఇచ్చిన అనంతపురం మైనార్టీలు

AP
AP: Historic Republic Day celebrations in Amaravati

కొండమరాజుపాలెం పరిసరాల్లోని హైకోర్టు రోడ్డుకు ఆనుకుని, మంత్రుల నివాసాల ఎదురుగా ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ పరేడ్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, రంగుల బాణసంచా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్ర(AP) విభజన అనంతరం ఇప్పటివరకు విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకలకు భిన్నంగా, అమరావతిలో నిర్వహించే ఈ వేడుకలు రాజధాని అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక ఘట్టంగా నిలవనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అమరావతికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.