విశాఖపట్నంలో(AP) రేపటి నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు కంటే ముందే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వానికి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. సదస్సుకు ముందుగానే వివిధ సంస్థలతో ప్రభుత్వం పలు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంటోంది. గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కొన్ని ప్రముఖ పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధత వ్యక్తం చేయడం విశేషం.
Read also: 2000 కోళ్లను వదిలేసిన యజమాని.. ఎగబడ్డ జనం

రెన్యూ పవర్ భారీ పెట్టుబడులు లోకేష్ ముందుండి సంతకాలు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ (AP) పర్యవేక్షణలో ఈ ఒప్పందాలు వేగంగా పూర్తవుతున్నాయి. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంధన రంగంలోని ప్రముఖ సంస్థ రెన్యూ పవర్ ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సమక్షంలో ప్రభుత్వం మరియు రెన్యూ పవర్ సంస్థల మధ్య రూ.82 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.
ఈ ఎంఓయూలలో రూ.60 వేల కోట్ల విలువైన నాలుగు ఒప్పందాలు ఎడీబీతో కుదుర్చుకోగా, గతంలో అంగీకరించిన రూ.22 వేల కోట్ల పెట్టుబడులు కూడా అమల్లోకి రానున్నాయి. పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో ఈ పెట్టుబడులు కేంద్రీకృతం అవుతున్నాయి. ఈ ప్రాజెక్టులలో 6 GW PV ఇంగాట్-వేఫర్ యూనిట్, 2 GW పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్, 300 KTPA గ్రీన్ అమ్మోనియా సౌకర్యం, విండ్-సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పెట్టుబడులతో దాదాపు 10 వేలకుపైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగావకాశాలు సృష్టించబడనున్నాయి. ఇప్పటికే అనంతపురం జిల్లాలో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని రెన్యూ పవర్ నిర్ణయించగా, విశాఖలో జరుగనున్న సీఐఐ సదస్సుకు ముందే ఈ ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: