हिन्दी | Epaper

AP Govt : జీవిత ఖైదీలకు సర్కార్ గుడ్ న్యూస్

Sudheer
AP Govt : జీవిత ఖైదీలకు సర్కార్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జైళ్లలో మంచి ప్రవర్తనతో ఉండే ఖైదీలను పరిశీలించి త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఖైదీల జీవితాల్లో కొత్త ఆశ చిగురించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్‌కు ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

అర్హులైన ఖైదీలను ఎంపిక

అర్హులైన ఖైదీలను ఎంపిక చేసి వారి పేర్ల జాబితాను త్వరగా సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించింది. ఎంపికైన ఖైదీలు రూ.50,000 ష్యూరిటీతో విడుదల కానున్నారు. దీంతోపాటు, వారు శిక్షా కాలం పూర్తయ్యే వరకు ప్రతి మూడు నెలలకోసారి తమ స్థానిక పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలి. ఈ నియమాలు ఉల్లంఘిస్తే లేదా మళ్లీ నేరానికి పాల్పడితే విడుదలను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ap life prisoners
ap life prisoners

సమాజంలో తిరిగి ఒదిగిపోయే అవకాశం

ఈ నిర్ణయం ద్వారా సమాజంలో తిరిగి ఒదిగిపోయే అవకాశాన్ని ఖైదీలకు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సత్ప్రవర్తనతో మారిపోయిన ఖైదీలు, కొత్త జీవితం ప్రారంభించేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను మళ్లీ కలుసుకునే అవకాశం కలిగినందుకు ఖైదీ కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సమాజంలో పునరావాసం చెందే మార్గంలో ఇది ఒక మంచి ముందడుగు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870