రేషన్ కార్డు(Ration card) కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం పెద్ద అప్డేట్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరా వ్యవస్థలో విస్తృత మార్పులు చేసింది. గతంలో వాహనాల ద్వారా సరఫరా చేసిన పద్ధతిని పూర్తిగా మార్చి, మళ్లీ రేషన్ దుకాణాలను(AP Govt) ప్రజలకి దగ్గరగా తీసుకొచ్చింది. లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. ఇక కొన్ని ప్రాంతాల్లో ఈ రేషన్ దుకాణాలను మినీ మాల్స్గా మార్చే దిశగా ప్రభుత్వం ప్రాయోగిక చర్యలు ప్రారంభించింది.
Read Also: AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతిష్టను దిగజార్చేందుకు భారీ కుట్ర

అదే సమయంలో, రేషన్లో అందించే సరకుల పరంగా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం(AP Govt) అన్ని చౌకధరల దుకాణాల ద్వారా ఇప్పటికే ఇస్తున్న బియ్యం, పంచదారతో పాటు జనవరి 1 నుంచి రాగులు, గోధుమ పిండి కూడా అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ రెండు సరకులను నవంబర్ నుంచి కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇవ్వగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ నుంచి అనుమతి లభించింది.

దిల్లీలో కేంద్రమంత్రి జోషీతో సమావేశమైన మంత్రి మనోహర్ మాట్లాడుతూ, జనవరి నుంచి పీడీఎస్ బియ్యం బస్తాలను క్యూఆర్ కోడ్ ట్యాగ్లతో అందజేస్తామని తెలిపారు. దీతో అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోగలమని అన్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసే బియ్యం బస్తాలపై ఈ క్యూఆర్ ట్యాగింగ్ పద్ధతి అమల్లో ఉందని ఆయన చెప్పారు.
ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లుగా మంత్రి వివరించారు. అందులో 17.30 లక్షల టన్నుల కొనుగోలు పూర్తి జరిగిందని తెలిపారు. 2.60 లక్షల మంది రైతులకు రూ. 4,120 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 16 వేల మంది సిబ్బంది, 32 వేల రవాణా వాహనాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రైతులకు అవసరమైన 7.85 కోట్ల గోనె సంచులు అందజేసినట్లు మంత్రి మనోహర్ చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: