हिन्दी | Epaper

ముస్లిం ఉద్యోగులకు వెసలుబాటు కల్పించిన ఏపీ సర్కార్

Sudheer
ముస్లిం ఉద్యోగులకు వెసలుబాటు కల్పించిన ఏపీ సర్కార్

ముస్లిం ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త అందించింది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు విధుల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుని, అధికారులకు తగిన సూచనలు చేశారు.

మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఉపాధ్యాయులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకూ ఈ వెసులుబాటు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల కారణంగా ముస్లిం ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

AP government good news for

ఇక ముస్లింలకు మరో శుభవార్తగా, రంజాన్ తోఫా పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సంక్రాంతి, రంజాన్ పండుగల సందర్భంగా నిత్యావసర వస్తువులను అందించింది. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలను నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం తిరిగి తీసుకురానుంది.

అంతేకాకుండా, ముస్లిం మతపెద్దలు ఇమామ్, మౌజమ్‌లకు వేతనాలను త్వరగా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదేవిధంగా, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులకు సూచనలు అందించారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రంజాన్ మాసంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

📢 For Advertisement Booking: 98481 12870