ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోజువారీ పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచుతూ ప్రభుత్వం నూతన ఉత్తర్వులు జారీ చేసింది. కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు సంతకంతో నిన్నటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం, ఉద్యోగులు లేదా కార్మికులు రోజుకు గరిష్టంగా 10 గంటలు పనిచేయవలసి ఉంటుంది. అయితే, వారానికి మొత్తం పని గంటలు 48 గంటలను మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని ద్వారా పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, పనిలో లవచుర్ (flexibility) కల్పించడం లక్ష్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
Latest News: Vizianagaram: మద్యం కోసం భార్యపై ఆగ్రహం.. ప్రాణాలు తీసుకున్న భర్త!
అదే సమయంలో, పని గంటలు 48 దాటిన సందర్భంలో ఆ కార్మికులకు ‘ఓవర్ టైమ్’ (OT) కింద అదనపు వేతనం చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టంలో ఈ మేరకు సవరణలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమ యజమానులకు కొంత ఊరట కలిగించినప్పటికీ, కార్మిక సంఘాలు మాత్రం దీని పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 10 గంటల పనివేళలు ఉద్యోగులపై అదనపు ఒత్తిడిని పెంచవచ్చని, ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని కార్మిక నాయకులు అంటున్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం అదనపు వేతనాలు, విశ్రాంతి సమయాలు కచ్చితంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మహిళా ఉద్యోగుల భద్రతపై కూడా ప్రభుత్వం కొత్త నిబంధనలను జారీ చేసింది. ఒక సంస్థలో ఐదుగురు కంటే ఎక్కువ మహిళలు ఉన్నప్పుడు మాత్రమే వారిని రాత్రి పూట డ్యూటీకి అనుమతించనున్నారు. ఆ సందర్భాల్లో కూడా భద్రతా సిబ్బంది, రవాణా సౌకర్యం, సురక్షితమైన పని వాతావరణం వంటి ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ మార్పులు కార్మిక రంగంలో కొత్త మార్పులకు దారితీయవచ్చు. అయితే, ఇది కార్మికుల శ్రేయస్సు దిశగా లేదా యజమానుల సౌకర్యం దిశగా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/