ఆంధ్రప్రదేశ్(AP) ప్రజలకు విద్యుత్ ఛార్జీల విషయంలో శుభవార్త లభించింది. రాష్ట్రంలో కరెంట్ ధరలను స్వల్పంగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రూ డౌన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా యూనిట్కు 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.
Read Also: MS Dhoni : అమరావతికి రాబోతున్న ధోనీ

విద్యుత్ బకాయిల భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది
ప్రజలపై విద్యుత్ భారం తగ్గించడమే లక్ష్యంగా దాదాపు రూ.4,498 కోట్ల విలువైన విద్యుత్ బకాయిలను ప్రభుత్వం స్వయంగా భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దీని ఫలితంగానే విద్యుత్ సుంకం తగ్గింపు సాధ్యమైందన్నారు. తమ ఐదేళ్ల పాలనలో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు.
ట్రూ డౌన్ విధానం ద్వారా గృహ వినియోగదారులు, రైతులు, పరిశ్రమలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి ఈ విధానం అమలు చేస్తున్నామని, ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించిన మంత్రి, ప్రస్తుతం పారదర్శకంగా పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు.
గన్నవరం ఎయిర్పోర్ట్లో నూతన సబ్స్టేషన్ ప్రారంభం
విజయవాడ (AP)గన్నవరం విమానాశ్రయంలో రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన 132/33 కేవీ సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సబ్స్టేషన్ ద్వారా విమానాశ్రయంతో పాటు రెండు మండలాలు, పరిసర గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. గంగూర్ సబ్స్టేషన్పై భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇప్పటికే 75 వేలకుపైగా కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. రైతులకు పగటిపూట 9 గంటల పాటు కరెంట్ సరఫరా అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ రంగంలో నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: