Latest News: AP: ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం ప్రారంభం

Read Time:  1 min
Latest News: AP: ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం ప్రారంభం
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతుల ఆదాయాన్ని పెంచడం, సాగు వ్యవస్థను లాభసాటిగా మార్చడం అనే లక్ష్యంతో మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. రైతన్నా మీకోసం పేరుతో ఈ నెల 24వ తేదీ నుంచి వారంపాటు ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనుందని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదాతల ఇళ్లకు వెళ్తారు.

Read Also: AP Weather Update: అల్పపీడనం.. అతి భారీ వర్షాలు!

How KissanGPT helps Indian farmers earn profit

మద్దతుపై అవగాహన

పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై అవగాహన కల్పిస్తారు. అలాగే DEC 3న RSKల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహిస్తారు.మార్కెట్ లో, ఏ పంటలకు ధరలు మెరుగ్గా ఉన్నాయో, దానిని అనుసరించి రైతులు సాగు పద్ధతులను మార్చుకుంటే లాభాలు అధికమవుతాయని అధికారులు సూచించనున్నారు.ప్రస్తుత కాలంలో డిమాండ్ ఉన్న పంటలు, నష్టాలపట్ల రక్షణ కలిగించే వ్యవసాయ పద్ధతులు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అవకాశాలపై చర్చిస్తారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.