ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన ఈహెచ్ఎస్ (Employees Health Scheme) పథకం సజావుగా నడవక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఆరోగ్య సేవల అమలులో ఏర్పడిన లోపాలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎనిమిది వారాల్లో ప్రభుత్వం ముందు నివేదికను సమర్పించాల్సి ఉంది.
Read also: Amaravati: అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

AP government steps to resolve EHS issues
ఆరోగ్య సేవల పరిమితులను
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యయ విభాగం కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈవోతో పాటు రెండు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈహెచ్ఎస్ వ్యవస్థలోని సమస్యలను వివరించడంతో, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చింది.
రీయింబర్స్మెంట్ పరిమితిని జిల్లా స్థాయిలో 50 వేల నుంచి లక్షకు పెంచడం, ఆరోగ్య సేవల పరిమితులను రెండువేలక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడం, రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు కూడా ఆరోగ్య కార్డులు జారీ చేయాలని సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 2013లో ప్రారంభమైన ఈహెచ్ఎస్ పథకం ద్వారా ప్రస్తుతం 24 లక్షల మంది లబ్ధిదారులు ఉన్న నేపథ్యంలో, కమిటీ నివేదికతో దీర్ఘకాలిక సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు లభిస్తాయని ఆశిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: