हिन्दी | Epaper

AP Capital: బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత!

Rajitha
AP Capital: బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత!

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతకు కేంద్రం సన్నద్ధమవుతుంది. విభజన చట్టాల అనంతర పరిణమాలు, నిర్ణయాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎపిలో ఇప్పటికే దగ్గర, దగ్గర దశాబ్ద కాలం నుంచి అమరావతి రాజధానిగా ఉంది. దేశ మ్యాప్ లో సైతం అమరావతిని ఎపి రాజధానిగా సూచించారు. అయితే సాంకేతిక అంశాల కారణంగా అమరావతి రాజధాని చట్టబద్దతకు అనుమతి రాలేదు. ఎపి తాజా కేంద్రమంత్రి మండలిలో ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. ఎపి విభజన చట్టం పార్ట్ 2 కింద 5(1) నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. పార్ట్ 2 కింద 5(2) సబ్ సెక్షన్ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది.

Read also: road accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి

Legal status for Amaravati

Legal status for Amaravati

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తారు. పార్ట్ 25(2) సబ్సెక్షన్ లో ఆంధ్రప్రదేశకు నూతన రాజధాని ఏర్పాటవుతుంది అనేచోట అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కి నూతన రాజధాని ఏర్పాటైందని పేర్కొంటారు. వాస్తవానికి 10 ఏళ్లపాటు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు 2024 జూన్ 2తో ముగిసింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపై కేంద్రానికి నోట్ అందజేసింది. ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో కేంద్ర హోంశాఖ చెప్పాలంది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజప్తి చేసింది. సంబంధిత కేంద్ర శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరడంతో పలు మంత్రిత్వ శాఖలు ఇప్పటికే తమ అభిప్రాయాలు వ్యక్తపరిచాయి. పట్టణాభివృద్ధి, న్యాయ శాఖలు ఇంకా అభిప్రాయాలు చెప్పాల్సి ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిసింది.

అమరావతిలో వేగంగా అభివృద్ధి పనులు

ఈ మేరకు కేబినెట్ నోట్ తయారీలో హోంశాఖ నిమగ్నమైనట్లు అధికారులు వెల్లడించారు. రాజధాని అమరావతి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నది.. దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ తమ సంస్థల నిర్వహణకు ఎంఓయూలు చేసుకున్న సంగతి తెలిసిందే. డేటా సెంటర్ సహా ఎన్నో కంపెనీలు రానున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు రాజధాని అమరావతి నగర విస్తరణలో భాగంగా రెండో విడత భూసమీకరణకు యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. తుళ్లూరు మండలంలో 3 గ్రామాలు, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో 4 గ్రామాల పరిధిలో రైతుల నుంచి భూమి సమీకరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన రామసుబ్బమ్మ!

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన రామసుబ్బమ్మ!

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

పోలీసులపై కాల్పులకు దుండగుడి యత్నం

పోలీసులపై కాల్పులకు దుండగుడి యత్నం

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

జనావాసాలకు సురక్షిత మంచినీరు లక్ష్యం.. డి.సిఎం పవన్

జనావాసాలకు సురక్షిత మంచినీరు లక్ష్యం.. డి.సిఎం పవన్

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా లీసా గిల్

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా లీసా గిల్

📢 For Advertisement Booking: 98481 12870