ఆంధ్రప్రదేశ్ (AP) లో ఈ నెల 16న కనుమ పండుగ సందర్భంగా బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే బ్యాంకు సంఘాల విన్నపం మేరకు ప్రభుత్వం తాజాగా సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read also: Virus: ప్రమాదపు అంచుల్లో వేప

డిమాండ్ల సాధన కోసం
ఈ సెలవు ప్రకటనతో వరుసగా పండుగ సెలవులు రావడంతో సామాన్య ప్రజలు తమ బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అటు వారంలో 5 వర్కింగ్ డేస్ కోసం ఈ నెల 27న పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆ రోజున బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. తమ ప్రధాన డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు పోరాట బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: