हिन्दी | Epaper
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

 Telugu News: AP: వివేకా కేసు ఘటనపై బీటెక్ రవి వాంగ్మూలం

Sushmitha
 Telugu News: AP: వివేకా కేసు ఘటనపై బీటెక్ రవి వాంగ్మూలం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి(Vivekananda Reddy) హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని, ఈ కేసు నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలులోనే బెదిరించారని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనను తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన తెలిపారు. ఈ బెదిరింపుల కేసుకు సంబంధించి ఆయన తన వాంగ్మూలాన్ని పోలీసులకు అందజేశారు.

Read Also: World Cup: మహిళల వరల్డ్‌కప్ ఫైనల్ భారత్‌లోనే

AP

కర్నూలు ఎస్పీ విచారణ, రవి వాంగ్మూలం

ఈ ఘటనపై విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈరోజు కడప జైలును సందర్శించారు. దస్తగిరిని బెదిరించిన సమయంలో వేరే కేసులో బీటెక్ రవి కూడా అదే జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, సాక్షిగా ఉన్న బీటెక్ రవిని ఎస్పీ విచారించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.

బీటెక్ రవి ఆరోపణలు

విచారణ ముగిసిన అనంతరం బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. “పోలీసులు విచారణకు పిలవడంతో హాజరై, కర్నూలు ఎస్పీకి నా వాంగ్మూలం ఇచ్చాను. 2023 నవంబర్ 28న దస్తగిరి ఉంటున్న బ్యారక్‌లోకి చైతన్య రెడ్డి వెళ్లడం నేను స్పష్టంగా చూశాను. నా బ్యారక్ సరిగ్గా దానికి ఎదురుగానే ఉంది” అని ఆయన తెలిపారు.

“వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న వ్యక్తి బ్యారక్‌లోకి నిందితుడి కుమారుడిని ఎలా అనుమతిస్తారని ఆరోజే జైలు అధికారి ప్రకాశ్‌ను ప్రశ్నించాను. కానీ, అధికారులు నా మాటలను పట్టించుకోలేదు. ఆరోజు ఏం జరిగిందనేది ఎస్పీకి కూలంకషంగా వివరించాను. జైలుకు వచ్చి మరీ దస్తగిరిని బెదిరించడం వెనుక పెద్ద కుట్ర ఉందని నేను భావిస్తున్నాను” అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

దస్తగిరిని జైలులో ఎవరు బెదిరించారని ఆరోపణలు వచ్చాయి?

నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి బెదిరించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి ఎవరు?

పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870