हिन्दी | Epaper

News Telugu: AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

Rajitha
News Telugu: AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

AP: దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పండుగ కానుకను అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను ఒక నెల పెంచుతున్నట్లు ప్రకటించారు. పెరిగిన డీఏ నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుందని తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.160 కోట్ల అదనపు భారం పడనున్నట్లు వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మంత్రులతో సమావేశమైన అనంతరం సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఉద్యోగులు రాష్ట్ర పురోగతిలో కీలక భాగస్వాములని పేర్కొంటూ, “మీ కృషితోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. అందరూ ఆనందంగా దీపావళిని జరుపుకోవాలి” అని అన్నారు.

Rwad also: YCP : అధికారంలోకి వచ్చేస్తామని YCP కలలు కంటోంది: పార్థసారథి

AP

AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

సీపీఎస్ రద్దు

ఇకపోతే, పోలీస్ శాఖ సిబ్బందికి సంబంధించిన ఈఎల్ బకాయిల్లో రూ.105 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన మొత్తాన్ని జనవరిలో చెల్లించనున్నారు. అదేవిధంగా, ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లు దీపావళికి (Diwali) ముందే అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగుల ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడానికి వచ్చే 60 రోజుల్లో సంస్కరణలు చేపడతామని చంద్రబాబు తెలిపారు. సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ అమలు వంటి అంశాలపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. “ఉద్యోగుల సంక్షేమం మా ప్రభుత్వానికి ప్రాధాన్యం. వారి సంతోషమే రాష్ట్ర అభివృద్ధికి బలం” అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.

ఏపీ ప్రభుత్వం దీపావళి సందర్భంగా ఏం ప్రకటించింది?
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు ఒక నెల డీఏ (కరువు భత్యం) పెంపు ప్రకటించింది.

పెంచిన డీఏ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
నవంబర్ 1వ తేదీ నుంచి పెరిగిన డీఏ అమల్లోకి వస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870