వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా గాడి తప్పిందని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (paritala sunitha) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన ఆమె, గత పాలన కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆరోపించారు. జగన్ హయాంలో అభివృద్ధి కంటే గందరగోళమే ఎక్కువగా కనిపించిందని వ్యాఖ్యానించారు.
Read also: Uttam Kumar Reddy: ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

Andhra Pradesh has become chaotic under Jagan’s rule
ప్రస్తుత పాలనతోనే రైతులు సంతోషంగా ఉన్నారని
పర్యటనలో భాగంగా కక్కలపల్లి గ్రామంలోని చెరువుకు గ్రామస్తులతో కలిసి జలహారతి ఇచ్చిన పరిటాల సునీత, అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే గ్రామాలకు నీరు చేరుతోందని, చెరువులు మళ్లీ జలకళను సంతరించుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుత పాలనతోనే రైతులు సంతోషంగా ఉన్నారని, గ్రామాలు సస్యశ్యామలంగా మారుతున్నాయని చెప్పారు. చంద్రబాబు పాలన కొనసాగితే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: